kamal-Rajini : కోలీవుడ్ లో క్రేజీ మల్టీ స్టారర్ ?

తమిళ చిత్ర సీమలో ఎక్కువగా వినిపించే పేర్లు రజినీకాంత్, కమల్ హాసన్. కొన్ని దశాబ్దాలుగా అగ్ర హీరోలుగా కొనసాగుతున్నారు. వీరి సినిమాలు వస్తున్నాయంటే, ఒక కోలీవుడ్ లోనే కాదు, సౌత్ సినీ ప్రేక్షకులు మొత్తం ఎదురుచూస్తారు. ఇద్దరి సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతాయి. కానీ, వీరి మధ్య పోటీ ఎప్పుడు ఉండదు. ఒకరినొకరు గౌరవించుకుంటారు. తరచూ కలుసుకుంటూ తాము ఒక్కటే అని చెబుతారు.

ఈ ఇద్దరు అగ్ర హీరోలు ఇప్పటికే పలు సినిమాల్లో కలిసి చేశారు. కానీ, ఈ మధ్య కాలంలో వీరి కాంబోలో సినిమాలు రాలేదు. దీంతో ఈ క్రేజీ కాంబోను మరో సారి ఒకే తెరపై చూడాలని ఎంతో మంది అభిమానులు కోరుకున్నారు. కానీ, అలాంటి సినిమా రాలేదు. ప్రస్తుతం కోలీవుడ్ లో వినిపిస్తున్న వార్తలను చూస్తే ఆ సమయం వచ్చిందని తెలిసిపోతుంది.

ఈ అగ్ర హీరోలను మళ్లీ ఒకే తెరపైకి తీసుకురావడానికి యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ప్రయత్నిస్తున్నాడట. అంతే కాదు వీరికి ఓ స్టోరీని కూడా వినిపించాడట. అది ఇద్దరికి నచ్చడంతో ఈ ప్రాజెక్ట్ ఫిక్స్ అయిపోందని కోలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఈ క్రేజీ కాంబో ప్రాజెక్ట్ దాదాపు 250 కోట్లతో తెరకెక్కే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.

- Advertisement -

అయితే ఈ సినిమా సెట్స్ పైకి రావడానికి సమయం పడుతుందట. ప్రస్తుతం రజినీకాంత్, కమల్ హాసన్, లోకేశ్ కనగరాజ్ చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేసిన తర్వాత ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని సమాచారం. అంటే, 2024 లో ప్రారంభం అవుతుందని టాక్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు