Janhvi Kapoor : చివరికి తారక్ తోనే..

ప్రస్తుతం టాలీవుడ్ రేంజ్ ఎలా ఉందో అందరికీ తెలుసు. ప్రపంచాన్ని షేక్ చేసేలా సినిమాలు తెలుగు చిత్ర సీమ నుంచి వరుసగా వచ్చాయి. దీంతో టాలీవుడ్ లో సినిమాలు చేయాలని హీరో హీరోయిన్లు, దర్శకులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే కొంత మంది హీరో హీరోయిన్లు, దర్శకలు తెలుగులో సినిమాలు చేస్తున్నారు. అయితే బాలీవుడ్ దివంగత సీనియర్ నటి శ్రీ దేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ మాత్రం టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి చాలా ఆలోచిస్తుంది.

జాన్వీ కపూర్ టాలీవుడ్ లోకి NTR30 సినిమాతో ఎంట్రీ ఇస్తుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. NTR30లో హీరోయిన్ గా నటించాలని జాన్వీని డైరెక్టర్ కొరటాల శివ చాలా సార్లు సంప్రదించారు. నిజానికి ఎన్టీఆర్ తో పాటు మహేష్ బాబు, అల్లు అర్జున్ సినిమాల్లో అవకాశాలు జాన్వీ కపూర్ కు వచ్చాయి. కానీ, తాను టాలీవుడ్ లో సినిమా చేయను అని తెగిసి చెప్పినట్టు వార్తలు వచ్చాయి. దీంతో NTR30లో మరో బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకోవడానికి కొరటాల ప్రయత్నిస్తున్నాడు.

ఇదిలా ఉండగా తారక్ కు జోడీగా నటించాలని మరో డైరెక్టర్ జాన్వీ కపూర్ తో చర్చలు జరిపాడట. దీనికి జాన్వీ చాలా సింపుల్ గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్. ఇటీవల ఒక మీడియా సమావేశంలో దీనిపై జాన్వీ ఫుల్ క్లారిటీ ఇచ్చింది. తారక్ తో కలిసి పనిచేసే అవకాశం తనకు చాలా అర్థవంతమైనది అంటూ కామెంట్ చేసింది. దీంతో టాలీవుడ్ కు జాన్వీ ఎంట్రీ దాదాపు ఖాయమని తెలుస్తుంది.

- Advertisement -

ఆ డైరెక్టర్ ఎవరో కాదు.. తొలి సినిమా ఉప్పెన తోనే టాలీవుడ్ లో సెన్సెషన్ క్రియేట్ చేసిన బుచ్చిబాబు సాన. తారక్ సినిమాల లిస్ట్ లో బుచ్చిబాబుతో కూడా ఒక సినిమా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ ను తీసుకోవాలని ప్రయత్నించాడట. అది సక్సెస్ కూడా అయిందని సమాచారం. దీంతో బుచ్చిబాబు డైరెక్షన్ లో, తారక్ తో జాన్వీ కపూర్ టాలీవుడ్ లోకి అరంగేట్రం చేయనుంది అని చెప్పొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు