Trivikram : మైత్రి వాళ్ళతో త్రివిక్రమ్ గొడవలు ఇంకా సర్ధుమణగలేదా?

శ్రీమంతుడు మూవీ టైంలో మైత్రి మూవీ మేకర్స్ వారి నిర్మాణంలో ఓ సినిమా చేయడానికి త్రివిక్రమ్ అడ్వాన్స్ తీసుకున్నాడు. ఆ తర్వాత హారిక అండ్ హాసిని క్రియేషన్స్ వారితో త్రివిక్రమ్ భాగస్వామి అయిన తర్వాత.. మైత్రి బ్యానర్ లో సినిమా చేయలేను అని అడ్వాన్స్ తిరిగొచ్చేశాడు. అయితే ఆ నిర్మాతలు త్రివిక్రమ్ దగ్గర వడ్డీతో సహా వసూల్ చేశారు. అప్పటి నుండీ వీళ్ళ మధ్య గ్యాప్ వచ్చింది. మొన్నటికి మొన్న సర్కారు వారి పాట ప్రీ రిలీజ్ వేడుకలో మహేష్ తో పనిచేసిన అందరి దర్శకులు హాజరయ్యారు.

మహేష్ అయితే తాను చేయబోయే తర్వాతి సినిమా దర్శకులను కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ లకి ఆహ్వానిస్తూ ఉంటాడు.త్రివిక్రమ్ తో మహేష్ తర్వాతి చిత్రాన్ని చేయబోతున్నాడు. కానీ త్రివిక్రమ్ ను అతను పిలవలేదు. ఇందుకు కారణం సర్కారు వారి పాట నిర్మాతలతో త్రివిక్రమ్ కు ఉన్న వైరం అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు