Guntur Kaaram: మాస్ సాంగ్ పై గురూజీ, థమన్ లకు క్లాస్ పీకిన మహేష్… నిర్మాత కౌంటర్

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మాస్ మసాలా మూవీ “గుంటూరు కారం” ఇటీవల కాలంలో వరుసగా వివాదాల్లో చిక్కుకుంటుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన రూమర్ బయటకు రాగా, దానికి కౌంటర్ గా నిర్మాత నాగ వంశీ వేసిన ట్వీట్ క్లారిటీ ఇచ్చింది. మాస్ సాంగ్ పై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ గురుజీ, థమన్ లకు మహేష్ బాబు క్లాస్ పీకాడని తాజాగా ఫిలింనగర్ వర్గాల నుంచి వార్త బయటకు వచ్చింది. ఆ రూమర్ కు కౌంటర్ గా నిర్మాత నాగ వంశీ మూవీ అప్డేట్ ఇచ్చాడు. ఇంతకీ నాగ వంశీ ఇచ్చిన ఆ అప్డేట్ ఏంటి? చిత్ర బృందం రెస్పాండ్ అయ్యేంతగా ఎఫెక్ట్ చూపించిన ఆ రూమర్ ఏంటి? అనే విషయంలోకి వెళ్తే…

గుంటూరు కారం సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఈ ప్రాజెక్టు గురించి చాలా రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. అయితే రీసెంట్ గా ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన “ఓ మై బేబీ” సాంగ్ వివాదం ఇండస్ట్రీని ఊపేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా సినిమాలో ఉన్న మాస్ సాంగ్ పై మహేష్ బాబు అసంతృప్తిని వ్యక్తం చేశాడని, చిత్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ లకు ఈ విషయంలో క్లాస్ పీకాడని, సాంగ్ పై రీ వర్క్ చేయమని మహేష్ ఫైర్ అయ్యాడు అంటూ వార్త బయటకు వచ్చింది. ఆ వార్త బయటకు వచ్చిన కొద్దిసేపటికి నిర్మాత నాగ వంశీ రియాక్ట్ అవుతూ ఓ ట్వీట్ చేశాడు. అందులోనే సినిమా షూటింగ్ ఎంత దాకా వచ్చింది అనే అప్డేట్ ను ఇచ్చాడు.

ఇక ఆ అప్డేట్ విషయానికి వస్తే… “ప్రియమైన సూపర్ స్టార్ ఫ్యాన్స్, సినీ ప్రేమికులారా” అంటూ స్టార్ట్ చేసి “గుంటూరు కారం సినిమాలో నాలుగు పూర్తి స్థాయి పాటలు, ఒక బిట్ సాంగ్ ఉంది. ఇక మూడు పాటలు, బిట్ సాంగ్ కు సంబంధించిన షూటింగును ఇప్పటికే పూర్తి చేసాం. లాస్ట్ సాంగ్ కు సంబంధించిన షూటింగ్ ను డిసెంబర్ 21 నుంచి షెడ్యూల్ ప్రకారం స్టార్ట్ చేయబోతున్నాం. రీసెంట్ గా వచ్చిన న్యూస్ గాసిప్. గాసిప్ రాయుళ్లకు వాళ్లపై మీ దృష్టి పడడం అవసరం. కాబట్టి కొన్ని క్లిక్స్ కోసం వాళ్లు ఇలాంటి ఫేక్ న్యూస్ ను ప్రచారం చేస్తున్నారు. అలాంటి వార్తలకు మీరు ఎలా క్రియేట్ అవుతారో వాళ్లకు తెలుసు. మేము సైలెంట్ గా ఉన్నాము అంటే వాళ్లు ప్రచారం చేస్తున్న ఫేక్ న్యూస్ కరెక్ట్ అని అర్థం కాదు” అంటూ నాగ వంశీ ట్వీట్ చేశాడు. అయితే గురూజీకి, థమన్ కు మహేష్ బాబు వార్నింగ్ ఇచ్చాడు అనే వార్తను బయట పెట్టింది నమ్మదగిన ఫిల్మ్ సోర్స్ కావడం ఇక్కడ గమనార్హం. మరి నిజంగానే అతను బయటపెట్టినట్టుగా మహేష్ బాబు వాళ్లకు వార్నింగ్ ఇచ్చాడా? అయితే ఇప్పటికే “గుంటూరు కారం” మూవీకి వివాదాల వల్ల జరిగిన డ్యామేజ్ చాలు అనుకుని, నిర్మాత ఇలా కౌంటర్ ట్వీట్ వేసి కవర్ చేశాడా? అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ఇలాగైతే ఈ సినిమా తెరపైకి వచ్చేలోపు ఇంకెన్ని వివాదాలు చూడాల్సి వస్తుందో.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు