SSMB28 : విలన్ గా కోబ్రా నటుడు

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్.. అతడు, ఖలేజా సినిమాలు చేశాడు. అయితే ఇప్పుడు చాలాకాలం తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడో చిత్రం ఇది. దీంతో అభిమానులు ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాలో బుట్ట బొమ్మ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. పూజ హెగ్డే తో పాటు ప్రియాంక అరుల్ మోహన్ కూడా ఈ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో ప్రతి నాయకుడి పాత్రకి గాను త్రివిక్రమ్ మలయాళ ఇండస్ట్రీకి చెందిన ఓ విలక్షణ నటుడిని రంగంలోకి దింపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఇప్పటికే ఈ సినిమాలో విలన్ గా కొంతమంది పేర్లు బయటకు రాగా అందులో తెలుగు నటుడు తరుణ్ పేరు కూడా వినిపించింది. అయితే ఇందులో వాస్తవం లేదని తరుణ్ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో మలయాళ నటుడు రోషన్ మాథ్యూ ను త్రివిక్రమ్ గా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. రోషన్ మాథ్యూ ఎవరో కాదు, రీసెంట్ గా విడుదలైన చియాన్ విక్రమ్ ‘కోబ్రా’ సినిమాలోని మెయిన్ విలన్. 2015లో మాలివుడ్ లో నటుడిగా కెరియర్ మొదలుపెట్టిన రోషన్ ఆనతి కాలంలోనే విలక్షణ నటుడిగా గుర్తింపు పొందాడు. ఈ నేపథ్యంలోనే మహేష్ సినిమా కోసం అతన్ని తీసుకోవాలని త్రివిక్రమ్ ట్రై చేస్తున్నారని టాక్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు