Naga Chaitanya : చైతన్య-భాస్కర్ మూవీ చేతులు మారిందా..?

నాగ చైతన్య- పరశురామ్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందాల్సి ఉంది. దీన్ని ’14 రీల్స్’ ప్లస్ వారు నిర్మించాల్సి ఉంది. కానీ ‘సర్కారు వారి పాట’ చిత్రం ఆఫర్ రావడంతో పరశురామ్ ఆ ప్రాజెక్టుకి షిఫ్ట్ అయ్యాడు. దానికి కూడా ’14 రీల్స్’ వారు సహా నిర్మాతలుగా వ్యవహరించారు. కాకపోతే నాగ చైతన్యతో చేయాల్సిన ప్రాజెక్టుకి దర్శకుడిగా బొమ్మరిల్లు భాస్కర్ స్క్రిప్ట్ ను లాక్ చేసి పెట్టుకున్నారు. కాకపోతే నాగ చైతన్య కోసం పరశురామ్ రెడీ చేసుకున్న స్క్రిప్ట్ అలాగే ఉంది. దాంతో పరశురామ్ ప్రాజెక్టునే తెరకెక్కించాలి అని డిసైడ్ అయ్యారు.

దీంతో ఇప్పుడు బొమ్మరిల్లు భాస్కర్- నాగ చైతన్యల ప్రాజెక్టు అనిల్ సుంకర చేతికి వెళ్ళింది. ‘ఎకె ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్లో ఈ మూవీ రూపొందనుంది. నిజానికి అనిల్ సుంకర కూడా ’14 రీల్స్’ వారికి మంచి స్నేహితుడు. ఇతనికి ఇండస్ట్రీలో ఉన్న పెద్ద హీరోలంతా ఇట్టే అవకాశాలు ఇచ్చేస్తారు. ఈయన చాలా మంచి వ్యక్తి అని ఇండస్ట్రీలో జనాలు అంటుంటారు. కానీ ఏం లాభం ఒక్క ‘సరిలేరు నీకెవ్వరు’ తప్ప ఈయన నిర్మించిన ఏ సినిమా హిట్ అవ్వలేదు. ఆ సినిమా సక్సెస్ క్రెడిట్ కూడా దిల్ రాజు- అనిల్ రావిపూడి ఖాతాలోకి వెళ్ళిపోయింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు