Cameramen gangatho rambabu : ఫ్యాన్స్ లో జోష్ నింపడానికి ఈ సినిమాయే కరెక్టా?

టాలీవుడ్ లో గత కొన్నాళ్లుగా రీ రిలీజ్ సినిమాల ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో చాలా మంది టాప్ హీరోల సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. ఇక లాస్ట్ టైం రవితేజ నటించిన వెంకీ మూవీ కూడా రీ రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇదిలా ఉండగా ఈ ఇయర్ ఫిబ్రవరి 7న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కెమెరామెన్ గంగతో రాంబాబు మూవీ రీ రిలీజ్ అవుతుందన్న సంగతి తెలిసిందే. అప్పట్లో యావరేజ్ గా ఆడిన ఈ సినిమా ఫ్యాన్స్ కి మాత్రం ఫేవరేట్ సినిమాల్లో ఒకటి. అయితే ఈ సినిమాయే ఎందుకు రీ రిలీజ్ చేస్తున్నారు, పవన్ సినిమాల్లో మరేదైనా బ్లాక్ బస్టర్ ని రిలీజ్ చేయొచ్చుగా అని కొందరు నెటిజన్లు అంటున్నారు.

కానీ లేటెస్ట్ గా వచ్చిన సమాచారం ప్రకారం కెమెరామెన్ ను కావాలనే ఈ సీజన్లో దింపుతున్నారని తెలుస్తుంది. చాలా మంది ఫ్యాన్స్ కోసం మాత్రమే, ఫ్యాన్స్ లో జోష్ నింపడానికి మాత్రమే ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారని అనుకున్నారు. కానీ అసలు విషయం వేరే ఉంది. ఈ సినిమా ఒక పొలిటికల్ సెటైరికల్ డ్రామాగా తెరకెక్కిందన్న సంగతి తెలిసిందే. రానున్న ఎలెక్షన్లను దృష్టిలో పెట్టుకుని ఫ్యాన్స్ లో, ఇంకా కామన్ ఆడియన్స్ లో ఒక రాజకీయాలపై ఒక అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతోనే ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారని టాక్ నడుస్తుంది.

ఈ విషయాల్లో ఎంత నిజముందో తెలీదు గాని, ఈ పాయింట్స్ నిజమే అని అనిపిస్తుంది. పైగా కెమెరామెన్ గంగతో రాంబాబు రిలీజ్ టైం లో అప్పట్లో ఎంత రచ్చ జరిగిందో తెలిసిందే. మళ్ళీ 12 ఏళ్లకు రీ రిలీజ్ పై అంచనాలు వచ్చేసాయి. ఇక ఈ సినిమాకు పెద్దగా ప్రమోషన్లు చేయకున్నా ఫ్యాన్స్ ఆటోమేటిక్ గా థియేటర్లకు వస్తారని సమాచారం. మరి రానున్న ఎలక్షన్లలో రాజకీయ నేపథ్యంలో వస్తున్న స్ట్రెయిట్ సినిమాలకి ధీటుగా రాంబాబు ఎంతవరకు ప్రభావం చూపిస్తాడో చూడాలి.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు