Aadikeshava: మామతోనే పోటీపడగలడా? ఎందుకు రిస్క్?

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం “ఆది కేశవ”. కొత్త దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఒక దేవాలయం బ్యాక్ డ్రాప్ లో జరిగే కమర్షియల్ మూవీగా వస్తుంది. ఇటీవల రిలీజ్ అయిన టీజర్ డీసెంట్ గా ఉంది. ఇక తాజాగా ఈ సినిమా యూనిట్ నుండి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది.

ఆదికేశవ సినిమాను ఆగష్టు 18న విడుదల చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించడం జరిగింది. అయితే ఇక్కడే ఒక చిక్కు వచ్చి పడింది. ఈ సినిమా విడుదలకు వారం ముందే ఆగష్టు 11న మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా విడుదల అవుతుంది. అంటే వారం తేడాతో మావయ్య సినిమా తో పోటీ పడడానికి మెగా మేనల్లుడు సిద్ధమయ్యాడన్నమాట. అయితే ట్రేడ్ విశ్లేషకులు మాత్రం వైష్ణవ తేజ్ సినిమా చిరు సినిమాకి ఎదురెళ్ళడం కరెక్ట్ కాదని అంటున్నారు.

ఎందుకంటే ఆదికేశవ మూవీ నుండి విడుదలైన టీజర్ ఏమాత్రం మెప్పించలేకపోయింది. అంటే ఆ టీజర్ విజువల్స్ బాగానే ఉన్నా కంటెంట్ రొటీన్ గా ఉండడంతో ఆడియన్స్ లో పెద్దగా బజ్ క్రియేట్ అవ్వలేదు. అసలే హైప్ లేని సినిమా కావడంతో మెగా కాంపౌండ్ నుండి వచ్చి మెగా స్టార్ తోనే పోటీ అంటే మంచిదికాదని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒక వేళ సినిమాకి నెగిటివ్ టాక్ వస్తే దారుణమైన నష్టాలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఆగష్టు 18 కాకుండా దీపావళి టైమ్ లో ఆదికేశవ రిలీజ్ చేస్తే మంచిదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు