Kollywood : ఆస్పత్రిలో స్టార్ హీరో

మాస్ యాక్షన్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో మంచి క్రేజ్ ఉన్న నటుడు విశాల్‌. ఆ క్రేజ్ ను కాపాడుకోవడం కోసం తెగ ప్రయత్నం చేస్తున్నాడు. విశాల్ ఇటీవల ఎక్కువగా క్రైమ్, యాక్షన్ చిత్రాలు చేస్తున్నాడు. ఒక ఆసక్తికర పాయింట్ ఎంచుకోవడం, దాని చుట్టూ మంచి స్క్రీన్ ప్లే అల్లుకొని మెప్పిస్తున్నారు. అభిమన్యుడు, యాక్షన్, సామాన్యుడు వంటి చిత్రాలు ఆకోవకు చెందినవే. ఇలాంటి సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడుతున్నాయి. దీంతో తన నెక్స్ట్ సినిమాతో ఎలాగైనా హిట్టు కొట్టాలని చూస్తున్నాడు విశాల్.

ఇది ఇలా ఉండగా విశాల్ ఎప్పుడు గాయాల పాలవుతున్నట్టు వస్తున్న వార్తలు చూస్తూనే ఉన్నాం. తాజాగా మరోసారి విశాల్ కి షూటింగ్ లో తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విశాల్ ‘మార్క్ ఆంటోనీ’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. గురువారం ఉదయం నుంచే ఈ చిత్ర షూటింగ్ మొదలైంది. భారీ యాక్షన్ ఎపిసోడ్ లో నటించే క్రమంలో విశాల్ కి తీవ్ర గాయం అయినట్లు తెలుస్తోంది.

దీనితో షూటింగ్ లోకేషన్ లోనే విశాల్ కి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం షూటింగ్ ను విడిచిపెట్టి ఆస్పత్రికి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. వైద్యులు కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని విశాల్ కు సూచించారట. దీనితో మార్క్ ఆంటోని దర్శకత్వంలో వస్తున్న సినిమా షూటింగ్ కి కొంతకాలం బ్రేక్ పడ్డట్లు అయింది. విశాల్ ఇటీవలే లాఠీ అనే చిత్రాన్ని ఫినిష్ చేసిన సంగతి తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు