మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన తరువాత వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మలయాళంలో సూపర్ హిట్ లూసిఫర్ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 05న విడుదల కానుంది. విడుదల కేవలం 15 రోజుల సమయం మాత్రమే ఉండడంతో ఈ సినిమాకి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ సృష్టిస్తున్నాయి.
మోహన్రాజా దర్శకత్వం వహిస్తున్న గాడ్ ఫాదర్ చిత్రంలో నయనతార, సత్యదేవ్, సల్మాన్ఖాన్, బ్రహ్మాజీ, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నారు. కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీచౌదరి, ఎన్వీప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఓటీటీ రైట్స్ ఫ్యాన్సీ ధరకే విక్రయించినట్టు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్ డిజిటల్ రైట్స్ను దక్కించుకున్నట్టు సమాచారం. తెలుగు, హిందీలో కలిపి నెట్ఫిక్స్ రూ.57 కోట్లు చెల్లించినట్టు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాయలసీమలోని అనంతపురం వేదికగా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించనున్నట్టు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. ఈ ఈవెంట్ ఈనెల 25న నిర్వహించనున్నట్టు సమాచారం. చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తేదీని మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. మలయాళంలో పృథ్వీరజ్ పోషించిన పాత్రను తెలుగులో సల్మాన్ చేస్తున్నారు. చిరంజీవి సోదరి పాత్రలో నయనతార కనిపించనుంది. విలన్ గా సత్యదేవ్ నటిస్తున్నారు.