Biggboss season7: డిప్యూటీస్ ని డిసైడ్ చేసిన యావర్..

 

బిగ్ బాస్ సీజన్ 7 లో కెప్టెన్సీ టాస్క్ లో ఫస్ట్ విజేత గా నిలిచి పల్లవి ప్రశాంత్ కెప్టెన్ అయిన సంగతి తెలిసిందే. అయితే ప్రశాంత్ తన బాధ్యతలని సరిగ్గా నిర్వర్తించనందువల్ల కెప్టెన్సి కోల్పోయి, తిరిగి రెండు రోజుల తరువాత దక్కించుకున్నా, లేటెస్ట్ గా జరిగిన టాస్క్ లో అందరి యావర్ గెలిచి కెప్టెన్ పదవి దక్కించుకున్నాడు.

అయితే యావర్ కెప్టెన్సీ బ్యాడ్జ్ గెలుచుకున్నాక కొంచెం ఎక్కువ స్ట్రిక్ట్ గా ఉంది హౌస్ ని బాగానే కంట్రోల్ చేస్తున్నాడు. ముఖ్యంగా ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు. ఇక తాజాగా బిగ్ బాస్ కెప్టెన్ కి ఇచ్చిన అవకాశాల్లో తనకి అసిస్టెంట్స్ గా ఇద్దరు డిప్యూటీలను ఎంచుకోవచ్చని చెప్పడం జరిగింది. ఆ అసిస్టెంట్ లని కూడా యావర్ నే ఎన్నుకోమనగా, తన బాధ్యతల్లో కొన్నింటిని వాళ్ళతో షేర్ చేసుకోవచ్చని, వీఐపీ రూమ్ ని కూడా పంచుకోవచ్చని అన్నాడు.

- Advertisement -

ఇక యావర్ హౌస్ లో డిస్కషన్ తర్వాత తన డిప్యూటీస్ ని ఎంచుకోవడం జరిగింది. మొదటి డిప్యూటీ గా శివాజీని, రెండో డిప్యూటీ గా సందీప్ ని ఎంచుకోగా, శివాజి కి రేషన్ ఫుడ్ డ్యూటీ ని ఇవ్వగా, సందీప్ కి కిచెన్ బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఇక యావర్ కెప్టెన్సీ లో ఫుడ్ విషయంలో కేర్ బాగా తీసుకున్నాడని అనిపిస్తుంది. ఇక బిగ్ బాస్ షో లో ఫస్ట్ టైం అందరూ కలిసి ఒకేచోట తినడం కనిపించింది.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు