Sammathame : ఓటీటీకి “సమ్మతమే”

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా, తెలుగు హీరోయిన్ చాందిని చౌదరి హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “సమ్మతమే”. ఈ సినిమా జూన్ 24న థియేటర్స్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గోపినాథ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమాతో పాటు “చోర్ బజార్” తో ఆకాశ్ పూరీ, “7 డేస్ 6 నైట్స్” తో సుమంత అశ్విన్ బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డారు.

వీటి కంటే ముందే, “అంటే సుందరానికీ” సినిమాతో నాని థియేటర్స్ లోకి వచ్చాడు. ఈ సినిమా పాజిటివ్ టాక్ వచ్చానా, కలెక్షన్లు మాత్రం పెద్దగా రాలేదు. మినిమం గ్యారంటీ హీరో నానికే ఇలా ఉంటే, తమ పరిస్థితి ఏంటి అనే అనుమానంతోనే కిరణ్ అబ్బవరం “సమ్మతమే” థియేటర్స్ లోకి వచ్చింది.

అందరూ ఊహించినట్టే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా, ప్రేక్షకులు థియేటరక్స్ కు మాత్రం రాలేకపోయారు. ప్రస్తుత కాలంలో ప్రేక్షకులు ఓటీటీకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఏ సినిమా రిలీజ్ అయినా, రెండు, మూడు వారాల్లో ఓటీటీకి వచ్చేస్తున్నాయి. దీంతో ప్రేక్షకులు థియేటర్స్ రావడం లేదు. ఇదే పరిస్థితి “సమ్మతమే” సినిమాకు వచ్చింది. అని చెప్పొచ్చు.

- Advertisement -

దీంతో ఓటీటీ లవర్స్ ను అయినా, ఆకట్టుకోవడానికి “సమ్మతమే” రెడీ అవుతుంది. ఈ నెల 15 నుండి ఈ సినిమా ఆహా ఓటీటీ ప్లాట్ ఫాంలో అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని ఆహా అధికారికంగా ప్రకటించింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు