ఓటీటీలో మోస్ట్ అవైటెడ్ వెబ్ సిరీస్ ఎదైనా ఉందా అంటే, అది “పరంపర” అని చెప్పొచ్చు. 2021 డిసెంబర్ లో “పరంపర” మొదటి సీజన్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో వచ్చింది. ఈ వెబ్ సిరీస్ ఓటీటీ లవర్స్ ను ఫుల్ గా ఆకట్టుకుంది. శరత్ కుమార్, నవీన్ చంద్ర, జగపతి బాబు నటన హైలైట్ గా ఉంది. అలాగే ట్విస్ట్ లతో ఇంట్రెస్టింగ్ సాగే ఈ వెబ్ సిరీస్, చివరకు కూడా ఓ ట్విస్ట్ ఇచ్చి ఎండ్ చేశారు. దీంతో దీంతో సీజన్ 2పై ఓటీటీ లవర్స్ కు ఆసక్తి పెరిగింది.
ఈ మోస్ట్ అవైటెడ్ వెబ్ సిరీస్ రెండో సీజన్ జూలై 21 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం కానుంది. తాజా గా ఈ రెండు సీజన్ కు సంబంధించిన ట్రైలర్ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా ఈ ట్రైలర్ విడుదల అయింది.
ఈ ట్రైలర్ “ఈ యుద్ధం ఎవరి కోసం మొదలుపెట్టావో గుర్తుంది కానీ, ఎందుకోసం మొదలుపెట్టావో గుర్తు లేదు” అనే డైలాగ్తో ప్రారంభవుతుంది. దీనికి నవీన్ చంద్ర “ఫ్రీడమ్ కోసం. మా నాన్న దగ్గర నుంచి లాక్కున్న అధికారం కోసం. పోగొట్టుకున్న పేరు, కోల్పోయిన జీవితం అన్నీ తిరిగి కావాలి” అంటూ చెప్పే ఆకట్టుకుంటుంది.
అలాగే సీజన్ 2 లో పవర్ కోసం నవీన్ చంద్ర, శరత్ కుమార్ ల మధ్య పోటీ బాగానే ఉన్నట్టు తెలుస్తుంది. శరత్ కుమార్ ను ఢీ కొట్టడానికి నవీన్ చంద్ర గట్టిగానే పోరాడినట్టు అర్థమవుతుంది. అలాగే ఈ రెండో సీజన్ లో దర్శకులు స్ట్రాంగ్ ఎమోషన్స్ ను పండించినట్టు తెలుస్తుంది. మొత్తంగా ఈ నెల 21న స్ట్రీమింగ్ కాబోయే, రెండో సీజన్ పై ఈ ట్రైలర్ భారీగా అంచనాలను పెంచింది.
కాగా ఈ పరంపర వెబ్ సిరీస్ ను ఎల్. కృష్ణ విజయ్, అరిగెల విశ్వనాథ్ల దర్శకత్వం వహించారు. అలాగే, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించారు.
https://youtu.be/UTXlUXqCVPk