అడివి శేష్ హీరోగా మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో నటించిన సినిమా ‘మేజర్’. ఈ సినిమా జూన్ 3 ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో 26/11 ముంబై దాడుల్లో జరిగిన పరిణామాలను తెరకెక్కించారు దర్శకుడు శశి కిరణ్ తిక్క.
ఈ సినిమా తెలుగు, మలయాళంలో మంచి వసూళ్లనే సాధించింది.
మంచి వసూళ్లతో పాటు ఈ సినిమాకు ప్రశంసలు కూడా వచ్చాయి.
పవన్ కళ్యాణ్, చిరంజీవి సహా పలువురు ప్రముఖులు ఈ టీం ను అభినందించారు. సినిమా మొదలైప్పటినుండే ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ, ప్రొమోషన్స్ ను కొత్త పంథాలో చేస్తూ “మేజర్” ను ఆడియన్స్ దగ్గరకు తీసుకెళ్లింది ఈ టీం.
రిలీజ్ కు కొన్ని రోజులు ముందుగానే వేర్వేరు ప్రాంతాల్లో ఈ సినిమాను ప్రదర్శించడం. ప్రతిచోటా మంచి ఆదరణ రావడం ఈ సినిమాకు బాగా కలిసొచ్చింది. ప్రస్తుతం మేజర్ సినిమా ఇప్పుడు ఓటిటి రిలీజ్ కు సిద్దమవుతుంది. జులై 3న ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో రానున్నట్లు అధికారికంగా ప్రకటించింది నెట్ ఫ్లిక్స్ సంస్థ. ఈ చిత్రాన్ని జీఎంబీ ఎంటర్టైనమెంట్స్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా, ఏ+ఎయస్ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. అడివిశేష్కు జోడీగా సాయి మంజ్రేకర్ హీరోయిన్గా నటించింది. ప్రకాష్ రాజ్, రేవతి, శోభితా ధూళిపాల కీలక పాత్రల్లో నటించారు.
The untold story of a son. The untold story of a father. The untold story of a SOLDIER. 🇮🇳🪖
Major is coming to Netflix on 3rd July in Telugu, Hindi and Malayalam! #MajorOnNetflix pic.twitter.com/1ngxcOciuQ
— Netflix India South (@Netflix_INSouth) June 30, 2022