Bimbisara : ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విషాదం

నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ లో భారీ బడ్జెట్ సినిమా బింబిసార. మల్లిడి వశిష్ట్ ఈ సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఫాంటాసీ యాక్షన్ జోనర్ లో వస్తున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. కళ్యాణ్ రామ్ కెరీర్ కు ఈ భారీ బడ్జెట్ సినిమా చాలా కీలకంగా మారనుంది. బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా శుక్రవారం రాత్రి గ్రాండ్ గా జరిగింది. తారక్ చీఫ్ గెస్ట్ గా వచ్చాడు.

ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది. కానీ, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విషాదం చోటుచేసుకుంది. పుట్ట సాయిరామ్ అనే యువకుడు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చనిపోయాడు. ఈవెంట్ నుండి సాయిరామ్ ను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే సాయిరామ్ చనిపోయాడని వైద్యులు చెప్పారని టాక్. అయితే, సాయిరామ్ ఎందుకు, ఎలా చనిపోయాడని మాత్రం తెలియలేదు.

తన అభిమాన హీరో ఎన్టీఆర్ ను చూడటానికి సాయి రామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చినట్టు తెలుస్తుంది. అయితే, ఈవెంట్ లో ఏం జరిగిందో తెలియదు కానీ, మరణించాడు. దీనిపై సాయి రామ్ కుటుంబ సభ్యులు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారని సమాచారం. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారని తెలుస్తుంది. ఈవెంట్ లో గొడవ జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారట. కాగా, సాయి రామ్ వెస్ట్ గోదావరి జిల్లా పెంటపాడు మండలం వాసి అని తెలుస్తుంది. హైదరాబాద్ లోని ఒక ఐటీ కంపెనీలో సాయి రామ్ పని చేస్తున్నట్టు సమాచారం.

- Advertisement -

కాగా, ఈ విషాద ఘటనపై బింబిసార టీం స్పందించింది. పుట్ట సాయిరామ్ చనిపోయిన విషయం తమ వద్దకు వచ్చిందని ట్వీట్ చేశారు. సాయిరామ్ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. సాయిరామ్ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ఇదిలా ఉండగా, ఇలాంటి విషాద ఘటనలు నందమూరి ఫ్యామిలీ హీరోలకే ఎదురవుతున్నాయి. గతంలో కూడా కొన్ని సినిమా ఈవెంట్ లో అభిమానులు ప్రమాదవశాత్తు మరణించారు. మళ్లీ ఇప్పుడు బింబిసార సమయంలో పుట్ట సాయిరామ్ మరణించాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు