జోహార్, అర్జున ఫల్గుణ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు తేజ మర్ని. ఈ డైరెక్టర్ తాజా గా GA2 పిక్చర్స్ బ్యానర్ లో కొత్త సినిమాను మొదలుపెట్టనున్నాడు. నేడు హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లో ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో బన్నివాసుతో పాటు విద్య మాధురి మరో నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
కాగా, కార్యక్రమంలో నిర్మాత బన్నీ వాస్ కూతురు బేబీ హన్విక క్లాప్ కొట్టారు. ఈ సినిమాలో సీనియర్ హీరో శ్రీకాంత్ తో పాటు వరలక్ష్మి శరత్ కుమార్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ కీలకపాత్రల్లో కనిపించబోతున్నారు. స్టోరీయే ప్రధాన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కబోతుంది.
ఈ సినిమా GA2 పిక్చర్స్ బ్యానర్ పై రాబోతుంది. కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలను నిర్మిస్తున్న GA2 పిక్చర్స్ నుండి పక్కా కమర్షియల్ రేపు ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. GA2 పిక్చర్స్ నుండి గతంలో భలే భలే మగాడివోయ్, మహానుభావుడు, ప్రతిరోజు పండగే లాంటి సినిమాలు వచ్చాయి.
ఈ సినిమాకు జగదీష్ చీకటి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అలాగే మ్యూజిక్ ను శక్తికాంత్ కార్తీక్ సమకూరుస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే మేకర్స్ విడుదల చేయనున్నారు.