Srikanth Addala : అవకాశాలు లేక టూర్లు ?

‘కొత్త బంగారు లోకం’ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ హిట్స్ తో శ్రీకాంత్ అడ్డాల మంచి మార్కులు తెచ్చుకున్నాడు. టాలీవుడ్ లో మల్టీ స్టారర్ ట్రెండ్ వచ్చిందంటే, కారణం శ్రీకాంత్ అడ్డాలనే అని చెప్పొచ్చు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు సినిమాలో వెంకటేష్, మహేష్ బాబు లాంటి స్టార్స్ ను కన్విన్స్ చేసి మల్టీస్టారర్ తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో చాలా మంది స్టార్ హీరోలు శ్రీకాంత్ అడ్డాలతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించారు. కానీ ‘ముకుంద’ చిత్రం శ్రీకాంత్ అడ్డాల సక్సెస్ జర్నీకి బ్రేకులు వేసింది. అయినా సరే మహేష్ బాబు పిలిచి మరీ ‘బ్రహ్మోత్సవం’ అవకాశం ఇచ్చాడు.

కానీ, ఈ మూవీ శ్రీకాంత్ కెరీర్ ను మొత్తం మార్చేసింది. ‘శ్రీకాంత్ అడ్డాల ‘బ్రహ్మోత్సవం’ ని రీమేక్ చేసినా అంత చెత్తగా డైరెక్ట్ చేయడమో’ అని ట్రోల్స్ అప్పట్లో ఎక్కువగా వచ్చాయి. అయినా సరే వెంకటేష్- సురేష్ బాబు లు పిలిచి మరీ ‘నారప్ప’ చేసే అవకాశం ఇచ్చారు. ఆ చిత్రాన్ని శ్రీకాంత్ కూడా బాగా హ్యాండిల్ చేశాడు. కానీ, ఇది ఓటీటీలో రిలీజ్ అవ్వడం తో శ్రీకాంత్ కు పెద్దగా కలిసొచ్చింది ఏమీ లేదు. తర్వాత ఇతను ‘కర్ణన్’ రీమేక్ ను కూడా తెరకెక్కిస్తారు అంటూ ప్రచారం జరిగింది. ‘ఆఫర్ వచ్చిన మాట నిజమే. కానీ స్క్రిప్ట్ ఫైనల్ చేయాల్సి ఉంది’ అని ‘నారప్ప’ ప్రమోషన్స్ సమయంలో ఈ డైరెక్టర్ చెప్పాడు. దానికంటే ముందు ‘గీతా ఆర్ట్స్’ లో ఓ సినిమా చేయబోతున్నట్లు కూడా ప్రకటించాడు. కానీ ఇప్పటివరకు ఆ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన రాలేదు. ఇప్పట్లో వస్తాయా అంటే, దానికి సమాధానం లేదు.

శ్రీకాంత్ అడ్డాల మాత్రం హైదరాబాద్ టు గోదావరి జిల్లాల టూర్లు వేసుకుంటూ టైం పాస్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. శ్రీకాంత్ అడ్డాలకు అవకాశాలు లేకనే టూర్లు వేస్తున్నట్టు టాక్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు