Virata Parvam : విరాటపర్వం నుండి “నగాదారిలో..” ..!

విరాట పర్వం… టాలీవుడ్ మోస్ట్ అవెయిటెడ్ ఫిల్మ్. 2019లో స్టార్ట్ అయిన ఈ మూవీ, కరోనా మహమ్మారితో పాటు మరి కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ మూవీ ఈ నెల 17న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. 1990 ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలోని నక్సల్ మూమెంట్ ఆధారంగా చేసుకుని, “నీదీ నాదీ ఒకే కథ” డైరెక్టర్ వేణు ఉడుగుల ఈ మూవీని తెరకెక్కించారు. రానా దగ్గుబాటి హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా నటించారు. అలాగే కీలక పాత్రల్లో ప్రియమణి, నవీన్ చంద్ర, నందితా దాస్, నివేదా పేతురాజ్ కనిపించబోతున్నారు.

ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజైన “వాయిస్ ఆఫ్ రవన్న” “సోల్ ఆఫ్ వెన్నెల” “కోలు కోలో కోలోయమ్మ” లిరికల్ సాంగ్ తో పాటు ఇటీవల రిలీజ్ చేసిన గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అలాగే ఈ మూవీపై ఇంట్రెస్ట్ ను కూడా పెంచాయి. తాజా గా ఈ మూవీ నుండి మరో అప్ డేట్ వచ్చింది. ఈ మూవీలోని నగాదారిలో.. పాటను రేపు ఉదయం 11 గంటలకు రిలీజ్ చేయనున్నట్టు విరాట పర్వం టీం అనౌన్స్ చేసింది.

తెలంగాణలో వినిపించే పాటల్లో ఎక్కువగా వాడే పదం నగాదారిలో. రియాలిటీకి దగ్గరగా ఉండాలని ఈ పదంతో జానపద పాట చేసింది విరాటపర్వం మూవీ టీం. కాగ ఈ మూవీకి “నీదీ నాదీ ఒకే కథ” ఫేం మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందిస్తున్నారు.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు