Pant : అక్కా నన్ను వదిలేయండి

బాలీవుట్ హీరోయిన్ ఊర్వశి రౌతేలా అంటే తెలియని వారుండరు. 28 ఏళ్లకే మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ముందుగా ఈ భామ చిన్న చిన్న పాత్రలు చేసేది. హేట్ స్టోరీ 4 తో పేరు తెచ్చుకుంది. దీని తర్వాత ఇటీవల తమిళనాడులోని శరవణన్ స్టోర్ అధినేత అరుల్ శరవణన్ నటించిన ది లెజెండ్ అనే సినిమాలో కనిపించింది. ఈ సినిమా ఫలితం పక్కన పెడితే, ఊర్వశి తీసుకున్న రెమ్యూనరేషన్ పై టాక్ పెద్దగానే వచ్చింది. 2 కోట్లు తీసుకునే ఊర్వశి, ది లెజెండ్ శరవణన్ కోసం ఏకంగా 20 కోట్లు తీసుకుందని వార్తలు వచ్చాయి.

ఇదిలా ఉంటే ఈ బాలీవుడ్ భామ ప్రస్తుతం మరోసారి వార్తల్లో కనిపిస్తుంది. ఊర్వశి రౌతేలా ఒక ఇంటర్వ్యూలో. వేధింపులకు గురి అవుతున్నాను. నా కోసం క్రికెటర్ రిషబ్ పంత్ గంటల తరబడి వెయిట్ చేసేవాడు అంటూ చెప్పుకొచ్చింది. దీనికి ఇన్ స్టాగ్రామ్ వేదిగా స్టోరీల రూపంలో క్రికెటర్ రిషబ్ పంత్ అదిరిపోయే రిప్లే ఇచ్చాడు. కానీ, కొంత సమయానికే ఆ స్టోరీలను పంత్ డిలీట్ చేశాడు. ఆ స్టోరీలో.. “ఇంటర్వ్యూలలో అబద్ధాలు చెప్పేవారిని చూడటం చాలా తమాషాగా ఉంది. పబ్లిసిటీ, మీడియా హెడ్‌లైన్‌ల కోసం అబద్ధాలు ఆడుతున్నారు. పేరు కోసం ప్రజలు ఏదైనా చేస్తారా.. అలాంటి వారిని ఆ దేవుడు చూస్తాడు’’ అంటూ రాసుకొచ్చాడు.

అలాగే #మేరా పీచా చోరో బెహెన్ (అక్కా నన్ను వదిలేయండి), #జూట్ కి భీ లిమిట్ హోతీ హే (అబద్ధానికి కూడా పరిమితి ఉంటుంది)” అనే ట్యాగ్ లను కూడా పంత్ జోడించాడు. పంత్ రియాక్షన్ ప్రస్తుతం బాలీవుడ్ లో పెద్ద సంచలనంగా మారింది. ఊర్వశి రౌతేలను నెట్టింట్లో విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. డబ్బు, పబ్లిసిటీ కోసం ఇలాంటి ఛీప్ పనులు చేస్తారా అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

- Advertisement -

కాగా, పంత్ రియాక్షన్ పై ఊర్వశి రౌతేలా స్పందించింది. “చోటు భయ్యా నువ్వు బ్యాట్ బాల్ తో ఆడుకోవాలి. కానీ నాతో ఆడుకుంటున్నావు. నా పరువు తీస్తున్నావు. నా మౌనాన్ని ఊపయోగించుకోవద్దు” అంటూ ఒక స్టోరీ పెట్టింది. అయినా, ఊర్వశిపై ట్రోల్స్ మాత్రం తగ్గడం లేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు