Samantha : మిస్సింగ్ ?

అక్కినేని నాగ చైతన్య-సమంత.. టాలీవుడ్ అందమైన జంట అంటే వెంటనే గుర్తుకు వచ్చేది ఈ జంటే. కానీ ఏడాది కిందట, తమ వ్యక్తిగత కారణాల వల్ల ఇద్దరూ విడిపోయారు. విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించేశారు. విడాకుల అనంతరం తమ వ్యక్తిగత జీవితాన్ని చాలా సంతోషంగా నడుపుకున్నారు. విడాకుల తర్వాత సమంత సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండేది. ఎప్పుడు ఏదో ఒక పోస్ట్ పెట్టుకుంటూ, ఫ్యాన్స్ లో ఉత్సాహం తెప్పించేది సమంత. అయితే, ఈ మధ్యకాలంలో మాత్రం సమంత సోషల్ మీడియాకి దూరంగా ఉన్నట్లు కనిపిస్తుంది. గతంలో మాదిరిగా యాక్టివ్ గా కనిపించడం లేదు.

ఎప్పుడో ఒకసారి అది కూడా చాలా ముఖ్యమైన పోస్టులనే షేర్ చేస్తుంది. ఇన్ స్టాగ్రామ్ లో చాలా యాక్టివ్ గా ఉండే సమంత చివరి పోస్టు జూలై 21న ఉంది. అంటే దాదాపు నెల రోజుల నుంచి ఇన్ స్టాగ్రామ్ లో ఒక్క పోస్ట్ కూడా లేదు. దీంతో అసలు సమంతకు ఏమైంది. ఎందుకు సోషల్ మీడియాకు దూరంగా ఉంటోంది అన్న సందేహాలు అభిమానుల్లో కలుగుతున్నాయి.

నాగచైతన్యతో విడిపోయిన తర్వాత సోషల్ మీడియాలో సమంత ఎక్కువగా ట్రోలింగ్స్ ను ఎదుర్కొంది. దీంతో ట్రోలర్స్, నెగిటివ్ కామెంట్స్ కు భయపడి సోషల్ మీడియాకు సామ్ దూరమైందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అలాగే సమంత వరుసగా సినిమాల్లో బిజీగా ఉంటుంది. దీని వల్ల సోషల్ మీడియాకు దూరంగా ఉంటుందని టాక్ వినిపస్తోంది. కాగా, ప్రస్తుతం సమంత.. శాకుంతలం, యశోద తో పాటు రౌడీ హీరోతో ఖుషి కూడా చేస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు