అప్పటికి ఇప్పటికి సినీ పరిశ్రమలో చాలా మార్పులు వచ్చాయి,
టాలీవుడ్, బాలీవుడ్ , కోలీవుడ్ అని కాకుండా ఇప్పుడు అంతా పాన్ ఇండియా సినిమా హవా నడుస్తోంది. సినిమాలు భారీ స్థాయిలో తెరకెక్కుతున్నాయి. ఇతర భాష దర్శకులు ఇక్కడ సినిమాలు చేయడం ఎప్పటినుంచో జరుగుతుంది. అలానే మన దర్శకులు వేరే భాష నటులతో పనిచేయడం కూడా ఎప్పట్నుంచో జరుగుతున్న ప్రక్రియనే.
ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇకపై ప్రాంతీయ చిత్రాలు కాకుండా కేవలం పాన్ ఇండియా సినిమాలే ఉంటాయనడంలో కూడా అతిశయోక్తి లేదు అనిపిస్తుంది. ఏది ఏమైనా ప్రాంతంతో సంబంధం లేకుండా సినిమాకి బ్రహ్మరథం పట్టడం అనేది తెలుగు ప్రేక్షకులకు అలవాటు. కేజిఫ్ సినిమాకి తెలుగులో వచ్చిన ఆదరణ అంతా, ఇంతా కాదు. అలానే చాప్టర్ – 2 కి కూడా భారీస్థాయి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సినిమా సలార్.
ప్రస్తుతం ప్రభాస్పై యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారని. ఈ యాక్షన్ సీన్స్ ఇంటర్వెల్లో వస్తున్నట్లు తెల్సుస్తోంది. ఈ షెడ్యూల్ ఈ నెల చివరి వరకు జరుగుతుందని తెలిసింది.ఇందులో ప్రభాస్ సరసన శ్రుతీహాసన్ హీరోయిన్గా నటిస్తున్నారు.జగపతిబాబు, మలయాళ నటుడు పృథ్వీరాజ్ కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కానుందనే టాక్ వినిపిస్తోంది.