Dil Raju : రాజుగారి కొత్త ప్రయాణం ?

సినిమాలకు, రాజకీయాలకు విడతీయలేని బంధం ఉంటుంది. సినీ ప్రమఖులు రాజకీయ వేత్తలు కావచ్చు. రాజకీయా నాయకుల కుటుంబ సభ్యులు సినీ స్టార్స్ కావచ్చు. ఈ రెండు సందర్బాలు జరిగిన అనుభవాలు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగానే ఉన్నాయి. టాలీవుడ్ కు చెందిన కొంతమంది హీరోలు, నటీ నటులతో పాటు నిర్మాతలు కూడా రాజకీయాల్లోకి వచ్చి రాణించారు. ఇప్పటికే నిర్మాలు దగ్గుబాటి రామనాయుడు, మురళీ మోహన్ టీడీపీ నుండి ఎంపీలుగా పోటీ చేసి గెలిచారు.

తాజాగా మరో నిర్మాత రాజకీయాల్లోకి వెళ్లడానికి ఆసక్తి చూపుతున్నారని తెలుస్తుంది. అతనే ప్రముఖ నిర్మాత దిల్ రాజు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించిన దిల్ రాజు, పలువురు స్టార్ హీరోల సినిమాలకు నిర్మాతగా ఉన్నారు. క్రమంగా టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగారు. అంతే కాకుండా, సినిమా డిస్ట్రిబ్యూటర్స్ రంగంలో నైజం కింగ్ గా పేరు తెచ్చుకున్నారు. దిల్ రాజు సాధారణంగా వ్యాపారం చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ, ఇప్పుడు ఈ నిర్మాత కళ్లు రాజకీయాలపై పడ్డాయట.

తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ లో చేరడానికి ఈ నిర్మాత పావులు కదుపుతున్నారని తెలుస్తుంది. ఇప్పటికే ఆ పార్టీ నేతలతో చర్చలు కూడా జరుపుతున్నారట. అతి త్వరలోనే గులాబీ కండువా కప్పుకుంటారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది. నిజామాబాద్ జిల్లాకు చెందిన దిల్ రాజు, అక్కడి నుండే ఎమ్మెల్యేగా గానీ, ఎంపీగా గానీ పోటీ చేసే అవకాశం ఉందని టాక్. ఈ వార్త నిజమైతే, తెలుగు సినీ పరిశ్రమ నుండి రాజకీయాల్లోకి వెళ్లిన మరో నిర్మాతగా దిల్ రాజు ఉంటాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు