Prince: సినిమా పోస్ట్ పోన్ అని సిల్లీగా చెప్పాడు

కొందరు దర్శకులు ఒక గొప్ప కథను రాసుకుని
ఆ కథపైన వాళ్ళ కాలాన్ని వెచ్చించి, దీనిని ఒక కళాఖండంగా తీర్చిదిద్దుదాం అనుకుంటారు. ఇంకొందరు దర్శకులు ఒక మంచి కథకు కొంత వినోదం జోడించి ప్రేక్షకులకి ఆనందాన్ని ఇవ్వాలి అనుకుంటారు.
కానీ వీటన్నింటికి అతీతమైన దర్శకుడు అనుదీప్ కే.వి.

అనుదీప్ ఒక మాములు లైన్ తీసుకుని దానికి లాజిక్స్ ఏమి జోడించకుండా కేవలం పంచులు మాత్రమే రాసుకుంటే చాలు ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు అని బలంగా నమ్మే దర్శకుడు.
పిట్టగోడ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన అనుదీప్.
తన రెండవ సినిమా “జాతి రత్నాలు” తో అద్భుతమైన హిట్ అందుకున్నాడు.

జోగిపేట్ అనే విలేజ్ నుండి హైదరాబాద్ వచ్చిన ముగ్గురు కుర్రాళ్ళు ఒక క్రైం లో ఇరుక్కున్నాక ఎలా బయటపడ్డారు అనేదే “జాతి రత్నాలు” సినిమా సారాంశం, ఈ సినిమాకి ఆది నుంచి ఆద్యంతం వరకు అనుదీప్ పైత్యాన్ని జోడించి ప్రేక్షకులు మన్ననలు పొందాడు.

- Advertisement -

ప్రస్తుతం శివ కార్తికేయన్ తో “ప్రిన్స్” అనే తెలుగు,తమిళ ద్విభాషా చిత్రాన్ని చేస్తున్నాడు అనుదీప్. ఈ సినిమాని ఆగష్టు 30న విడుదల చేయనున్నట్లు ముందుగా ప్రకటించారు, కానీ ఆ సినిమా ఇప్పుడు దీపావళి కి వాయిదా పడినట్లు ఆఫీసియల్ గా ఒక ఫన్నీ వీడియో ను రిలీజ్ చేసి అనౌన్స్ చేసారు. సినిమా పోస్ట్ పోన్ అనే సీరియస్ విషయాన్ని ఇంత సిల్లీగా చెప్పడం సోషల్ మీడియాలో చాలామందిని ఆకర్షిస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు