వరల్డ్ ఫేమస్ పాప్ సింగర్ జస్టిన్ బీబర్ భారత్లో చేయాల్సిన భారీ ఈవెంట్ రద్దు అయింది. వరల్డ్ టూర్లో భాగంగా అక్టోబర్ 18న ఢిల్లీలోని నెహ్రు స్టేడియంలో బీబర్ భారీ ఈవెంట్ జరగాల్సి ఉంది. కానీ ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో బీబర్ భారత్కి రావడం లేదని బుక్ మై షో ప్రకటించింది.
ముఖ్యంగా తనకు రామ్సే హంట్ సిండ్రోమ్ అనే అరుదైన వ్యాధి సోకిందని స్వయంగా చెప్పాడు. పాక్షిక పక్షవాతం కారణంగా ముఖం కుడి సగభాగాన్ని ఎలా కదలించగలడో కూడా ఇటీవలే ఓ వీడియోలో చూపించాడు. ముఖ్యంగా ముఖంలోని కుడి భాగం వైపు నాడి వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని వివరించాడు. నా శరీరం సహకరించే పరిస్థితుల్లో లేదు. నా ఎడమ కన్ను కూడా కొట్టుకోవడం లేదు. ఒక పక్కా సరిగ్గా నవ్వలేకపోతున్నాను. ప్రస్తుతం నేను మ్యూజిక్ చేసే ఆలోచనలో లేను.. నా పరిస్థితి మీరే అర్థం చేసుకోండి అని చెప్పాడు.
ప్రస్తుతం ప్రపంచ టూర్లో ఉన్న అతడు ఈ వ్యాధి కారణంగా తన తదుపరి పర్యటనలను కొంతకాలం రద్దు చేసుకుంటున్నట్టు చెప్పాడు. పూర్తిగా కోలుకునేంత వరకు ఎటువంటి సంగీత ప్రదర్శనలు ఇవ్వను అని చెప్పాడు. అందుకే ఇండియా షో రద్దు అయినట్టు బుక్ మై షో వెల్లడించింది. ఒక వైరస్ కారణంగానే ఈ వ్యాధి వాపించింది. ఈ విషయం తెలుసుకున్న ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అతని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అతడు కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.