Pooja Hegde : జన గణ మన మూవీలో పూజ హెగ్డే ఫిక్స్

పూరి జగన్నాథ్ .. జన గణ మన అనే కథని పెట్టుకుని సుమారు 6 ఏళ్ళ పాటు హీరోల చుట్టూ తిరిగాడు. కానీ ఎవ్వరూ ఆ కథకి ఓకె చెప్పలేదు. మహేష్ బాబుతో ఈ కథని తెరకెక్కించాలని పూరి ట్రై చేశాడు.కానీ మహేష్ ఒప్పుకోలేదు. తర్వాత వీళ్లిద్దరి మధ్య ఇగో క్లాష్ వచ్చినట్టు బహిరంగంగా చెప్పుకోలేని నిజం.అయితేనేం పూరి ఈ చిత్రాన్ని విజయ్ దేవరకొండ తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నాడు. ఈ మధ్యనే మూవీని భారీగా లాంచ్ చేసారు. అయితే ఈ మూవీలో హీరోయిన్ ఎవరు అనే విషయాన్ని ఇంకా బయటకి చెప్పలేదు. అయితే తాజా గా ఈ మూవీలో హీరోయిన్ గా  పూజ హెగ్డే ఫిక్స్ చేశారు.

మొదట జాన్వీ కపూర్ ను ఈ మూవీలో హీరోయిన్ గా అనుకున్నారు. అయితే చివరికి పూజ హెగ్డే ఎంపికైనట్లు తెలుస్తుంది. పూజ పాన్ ఇండియా హీరోయిన్. అయితే విజయ్ దేవరకొండ .. పూజ రేంజ్ స్టార్ కాదు.కానీ పూజ ఈ చిత్రం చేయడానికి ఒప్పుకుంది వంశీ పైడిపల్లి వల్ల అనేది ఇన్సైడ్ టాక్. ఎందుకంటే ఈ మూవీకి వంశీ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. గతంలో వంశీ దర్శకత్వంలో పూజ మహర్షి సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఆ మూవీ మంచి హిట్ అయ్యింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు