Pooja Hegde : బుట్ట బొమ్మకు ఎదురుదెబ్బ ?

సినీ పరిశ్రమ చాలా మారిపోయింది. కొన్నాళ్ల క్రితం ఒక సినిమా చేయడానికి బడ్జెట్ లక్షల్లో ఉండేది. హీరో, హీరోయిన్ రెమ్యూనరేషన్ వేలల్లో మాత్రమే ఉండేది. దీని వల్ల నిర్మాతలకు ఎక్కువ కష్టంగా ఉండేది కాదు. కానీ, ప్రస్తుతం సీన్ మారింది. సినిమాల బడ్జెట్ కోట్లు. కొన్ని సినిమాలు అయితే, 100 కోట్లకు పైగానే. ఇక హీరో, హీరోయిన్ కు పారితోషికం గురించి మాట్లాడుకోక పోవడమే మంచిది.

గత కొద్ది రోజుల క్రితం నిర్మాత నట్టి కుమార్, హీరోయిన్ ల రెమ్యూనరేషన్ల గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న పూజా హెగ్డే గురించి నిర్మాత నట్టి కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోట్లల్లో రెమ్యూనరేషన్ తీసుకోవడమే కాకుండా, తన చుట్టు ఉండే వ్యక్తిగత స్టాఫ్ మెయింటెన్స్ ఛార్జీలు కూడా నిర్మాతపైనే నెట్టేస్తుందని విమర్శించారు. అలాగే ఆర్కే రోజు భర్త సెల్వమణి కూడా ఓ సందర్భంలో ఇవే వ్యాఖ్యలు చేశారు.

తాజాగా కోలీవుడ్ లో ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఇదే విషయంలో బుట్టబొమ్మకు పెద్ద షాక్ ఇచ్చిందట. అసలు విషయం ఏంటంటే, పూజా హెగ్డే ఇటీవల సన్ పిక్చర్స్ బ్యానర్ లో విజయ్ తలపతికి జోడీగా బీస్ట్ సినిమా చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా సమయంలో పూజా ప్రతి రోజు ముంబై నుండి ఫ్లైట్ లో షూటింగ్ ప్రాంతాలకు వచ్చేదట. పూజా వెంటే 12 మంది వ్యక్తిగత సిబ్బంది కూడా ఎప్పుడు ఉండేవారట. ఇలా సినిమా షూటింగ్ చివరి వరకు పూజా ఖర్చులతో పాటు 12 మంది వ్యక్తిగత సిబ్బంది మెయింటెన్స్ ఛార్జీలు మొత్తం సన్ పిక్చర్స్ తోనే పెట్టించిందని తెలుస్తుంది.

- Advertisement -

అయితే, కమిట్ మెంట్ కంటే, పూజా ఎక్కువ ఖర్చు అయ్యేలా చేసిందని సన్ పిక్చర్స్ సంస్థ గ్రహించి, ఆ ఖర్చులను పూజాతోనే కట్టించాలని ఫిక్స్ అయిందట. లెక్కలు అన్నీ బయటకు తీసి, వాటన్నింటికి సంబంధించిన బిల్స్ కూడా పూజాకు పంపించారని కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ విషయంలో సన్ పిక్చర్స్ వెనక్కి తగ్గకపోవడంతో, పూజా చేసేదేమీ లేక, ఆ ఖర్చులను కట్టడానికి సిద్ధమైందని తెలుస్తుంది. కాగా, ఈ వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రస్తుతం హాల్ చల్ చేస్తున్నాయి. ఇవి నిజమా, కాదా అని తెలియాలంటే, సన్ పిక్చర్స్ గానీ, పూజా గానీ వివరణ ఇచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు