Pawan-Praksh-Vishnu : “మా” మధ్య గొడవల్లేవ్

శత్రువులు, మిత్రులు కలకాలం ఉండరు. శత్రువులు మిత్రులు కావచ్చు. మిత్రులు శత్రువులు కావచ్చు. ఇలాంటి సందర్భాలు ఎక్కువగా రాజకీయాల్లో చూస్తాం. ప్రస్తుతం ఇలాంటివి సినిమా రంగంలోనూ చూడాల్సి వస్తోంది.

కొన్ని రోజుల క్రితం “మా” ఎన్నికల సందర్భంలో ఇండస్ట్రీలో యుద్ధ వాతావరణం ఉండేది. టాలీవుడ్ రెండు వర్గాలుగా వీడిపోయింది. ఒక వర్గం మంచు విష్ణును అధ్యక్షుడిగా సపోర్టు చేసింది. మరో వర్గం వ్యతిరేకించింది. ఒక సందర్భంలో మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ కాకుండా మరో సినీ సంఘం వస్తుందని ప్రచారం కూడా సాగిందంటే, ఈ వివాదం ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. ఈ వివాదం ముఖ్యంగా మెగా ఫ్యామిలీ, మంచు ఫ్యామిలీ మధ్య జరిగిందని అందరికీ తెలిసిందే.

- Advertisement -

అధ్యక్ష అభ్యర్థులు ప్రకాశ్ రాజ్ – మంచు విష్ణు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణం ఉండేది. ఫలితాల తర్వాత మా సభ్యత్వానికే రాజీనామా చేశారు ప్రకాశ్ రాజ్.

గతంలో హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహించాడు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ను పలకరించాలని మా అధ్యక్షుడు మంచు విష్ణు ప్రయత్నించాడు.కానీ, పవన్ పట్టించుకోకుండా వెళ్లిపోయాడు. అప్పట్లో ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలైంది.


తాజా గా పవన్-ప్రకాశ్ రాజ్-మంచు విష్ణు ఒకే వేదికపై కనిపించారు. ఒకరినొకరు నవ్వుతూ పలకరించుకున్నారు. అంతే కాదు కాసేపు మాట్లాడుకున్నారు కూాడా.
యంగ్ హీరో విశ్వక్ సేన్, యాక్షన్ కింగ్ అర్జున్ కాంబినేషన్ లో సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. గురువారం పూజా కార్యక్రమాలతో ఈ సినిమా స్టార్ట్ అయింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చాడు. అలాగే, ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు కూడా కనిపించారు. ఈ సందర్భంలో ఈ ముగ్గురు కలిసి మాట్లాడుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఈ ఫోటోలను చూసి, ఇన్నాళ్లకు టాలీవుడ్ లో నెలకొన్న వేడి వాతావరణం చల్లబడిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు