Adipurush : అదే పనిలో..

ఆదిపురుష్, ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా. బాహుబలి తర్వాత డార్లింగ్ నుండి వచ్చిన రెండు సినిమాలు దారుణంగా నిరాశపర్చాయి. దీని తర్వాత ప్రభాస్ నాలుగు సినిమాలు చేస్తున్నాడు. దీనిలో ఆదిపురుష్ మొదట ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అందుకు తగ్గట్టు ఈ సినిమా హైప్ కూడా బాగానే ఉంది.

కానీ, ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ మాత్రం రావడం లేదు. ఇది రెబల్ స్టార్ ఫ్యాన్స్ కు పెద్ద లోటుగా ఉంది. వచ్చే ఏడాది జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అంటే ఈ సినిమా రిలీజ్ కు ఇంకా ఐదు నెలలు మాత్రమే సమయం ఉంది. 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ప్రమోషన్లు కనీసం 6 నెలల ముందు నుండి అయినా స్టార్ట్ అవ్వాలి.

అంటే, ఇప్పటికే ఆది పురుష్ కు సంబంధించిన పోస్టర్లు, నటీ నటులు ఫస్ట్ లుక్స్, టీజర్ విడుదల కావాలి. కానీ, ఇప్పటి వరకు ఏ ఒక్కటి కూడా రాలేదు. మేకర్స్ కూడా ఈ సినిమా షూటింగ్ కు సంబంధించి గానీ, పోస్ట్ ప్రొడక్షన్ కు సంబంధించిన ఫోటోలు గానీ అభిమానులతో పంచుకోలేరు. మొత్తంగా ఆదిపురుష్ మేకర్స్ తీరుపై డార్లింగ్ ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు.

- Advertisement -

అయితే, తాజా గా ఈ సినిమా దర్శకుడు ఓ రౌత్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో ఒక భారీ ఐమాక్స్ థియేటర్ ముందు నిలుచున్న ఫోటోను షేర్ చేశాడు. 12 జనవరి 2023 వరకు వెయిట్ చేయలేకపోతున్నానంటూ క్యాప్షన్ ఇచ్చాడు. అలాగే ఆదిపురుష్ హ్యాష్ ట్యాగ్ ను కూడా జోడించాడు.

దీంతో, ఓ రౌత్ ఆదిపురుష్ పనిలోనే ఉన్నాడని స్పష్టమవుతుంది. ఈ సినిమా ను హాలీవుడ్ లో విడుదల చేయడానికి సన్నాహాకాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. హాలీవుడ్ రిలీజ్ పై ఓ సందర్భంలో కృష్ణంరాజు తెలిపిన విషయం తెలిసిందే. అలాగే ఈ సినిమాను త్రీడీ వర్షన్ లో తీసుకురాబోతున్నారు. త్రీడీ వర్షన్ టెస్టింగ్ కోసం ఓ రౌత్ అమెరికాకు వెళ్లినట్టు తెలుస్తుంది.

మొత్తంగా ఓ రౌత్ నుండి వచ్చిన ఒక్క ఫోటో డార్లింగ్ ఫ్యాన్స్ కు ఎంతో కిక్కు ఇస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు