NTR : ముచ్చటగా మూడోసారి ?

‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత ఎన్టీఆర్ వరుసగా సినిమాలను లైన్ లో పెట్టే పనిలో ఉన్నాడు. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో NTR30 సినిమా చేయబోతున్నాడు. అతి త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. అది పూర్తయ్యాక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో NTR31 సినిమా చేస్తున్నాడు. ఇవి రెండు కూడా పాన్ ఇండియా ప్రాజెక్టులే. వీటి తర్వాత చేయబోయే సినిమాలపై కూడా ఎన్టీఆర్ దృష్టి పెట్టాడు. ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు కథకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఎన్టీఆర్ సన్నిహిత వర్గాల సమాచారం. కొరటాల మూవీ తర్వాత ప్రశాంత్ నీల్ మూవీ లేట్ అయితే, బుచ్చిబాబు సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి అని వారు చెబుతున్నారు.

అయితే ఇప్పుడు లైన్ లోకి మరో దర్శకుడు ఎంట్రీ ఇచ్చాడు. మరెవరో కాదు సురేందర్ రెడ్డి. ఎన్టీఆర్- సురేందర్ రెడ్డి కాంబినేషన్లో ఇప్పటికే ‘అశోక్’ ‘ఊసరవెల్లి’ సినిమాలు వచ్చాయి. ఇవి రెండు కూడా యావరేజ్ టాక్ సొంతం చేసుకున్నాయి. కానీ ఎన్టీఆర్ కి రాజమౌళి, వినాయక్ ల తర్వాత ఫేవరట్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది సురేందర్ రెడ్డి అనే చెప్పాలి. అందుకే ఇటీవల సురేందర్ రెడ్డి ఓ లైన్ చెప్పగా దానికి ఓకే చెప్పేశాడట ఎన్టీఆర్. ఫుల్ స్క్రిప్ట్ తో రమ్మని ఎన్టీఆర్ కోరడంతో సురేందర్ రెడ్డి ప్రస్తుతం ఆ పనిలో ఉన్నాడు అని తెలుస్తుంది.

ఫుల్ స్క్రిప్ట్ ఫైనల్ అయితే, ప్రశాంత్ నీల్ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కే అవకాశం ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు