Janhvi Kapoor : నా డ్రీమ్ ప్రాజెక్ట్ అదే

అతిలోక సుందరి శ్రీదేవికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శ్రీదేవి నట వారసురాలిగా వెండితెరకు పరిచయమైంది అందాల తార జాన్వి కపూర్. ఇప్పటివరకు జాన్వి చేసింది తక్కువ సినిమాలే అయినా, స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అయితే పొందింది. తన కెరీర్ ప్రారంభంలో జాన్వీ కపూర్ ఎన్నో విమర్శలను ఎదుర్కొంది. ఈ బ్యూటీ మొదటి సినిమా “ధడక్” తోనే విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అనంతరం కూడా వరుస కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ అందం, అభినయంతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడుతుంది. అయితే ఈ అందాల తార తాజాగా నటించిన చిత్రం “గుడ్ లక్ జెర్రీ”. 2018లో నయనతార ప్రధాన పాత్రలో నటించిన తమిళ హిట్ సినిమా “కొలమావు కోకిల” కి ఇది రీమేక్.

ఇటీవలే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో నేరుగా రిలీజ్ అయింది ఈ చిత్రం. ఈ క్రమంలోనే చిత్ర ప్రమోషన్లలో భాగంగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ ఎంట్రీ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. డ్రీమ్ హీరో ఎవరు అని అడిగిన ప్రశ్నకు.. తెలుగు హీరో జూనియర్ ఎన్టీఆర్ తో నటించడం నా డ్రీమ్ అని బదులిచ్చింది. ఎన్టీఆర్ తో నటించడాన్ని తాను ఒక గొప్ప గౌరవంగా భావిస్తున్నానని తెలియజేసింది. జూనియర్ ఎన్టీఆర్ ఓ లెజెండ్ అని జాన్వీ తెలిపింది. అయితే ఎన్టీఆర్ సినిమాలో ఛాన్స్ రాలేదని తెలిపింది.

తారక్ తో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్న అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. జాన్వి చేసిన ఈ కామెంట్స్ చూస్తుంటే ఆరోజు తొందరలోనే రాబోతుందని స్పష్టమవుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా జాన్వీ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కాగా, జాన్వీ-తారక్ కాంబో ఎన్టీఆర్30 లో ఉంటుందని వార్తలు వచ్చాయి. కానీ, అది సాధ్యం కాలేదని సమాచారం. కానీ, తారక్-బుచ్చిబాబు సినిమాలో జాన్వీ హీరోయిన్ గా నటించే అవకాశాలు ఉన్నాయని టాక్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు