Heeramandi: నేను హీరామండి షూటింగ్లో డిప్రెషన్లో పడ్డాను.. మనీషా కొయిరాలా ఎమోషనల్ కామెంట్స్..!

Heeramandi: బాలీవుడ్ బడా డైరెక్టర్ సంజయ్ లీల భన్సాలి ఓటిటి ఎంట్రీ ఇస్తూ తెరకెక్కించిన వెబ్ సిరీస్ నే హిరామండి. ఈ సెన్సేషనల్ డైరెక్టర్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. హిస్టారికల్ డ్రామా తో అలనాటి నటి మనీషా కోయిరాలా వేశ్య పాత్ర పోషించి ప్రతి ఒక్కరిని మెప్పించింది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె..తాను ఈ సిరీస్ షూటింగ్లో డిప్రెషన్ లో పడినట్లు తెలిపింది.

మనీషా కోయిరాలా మాట్లాడుతూ..” హీరామండి షూటింగ్ సమయంలో నేను చాలా డిప్రెషన్ మరియు మూడ్ స్వింగ్స్ తో పోరాడా. క్యాన్సర్ బారిన పడిన వ్యక్తిగా.. శరీరం, మనస్సు ఇలా ఒక్కదానితో ఒకటి ముడిపడి ఎలా ఉన్నాయో నాకు తెలుసు. అవి ఒకదానికి ఒకటి ఆధారపడతాయి. ఇప్పుడు కూడా నేను కొన్నిసార్లు డిప్రెషన్ను ఎదుర్కొంటూ ఉంటున్నాను.

Manisha Koirala's emotional comments
Manisha Koirala’s emotional comments

నిజాయితీగా చెప్పాలంటే.. ఈ సిరీస్లో పని చేస్తున్నప్పుడు.. డిప్రెషన్ నన్ను ఎంతగానో ఆక్రమించింది. నేను కేవలం వర్క్ పై దృష్టి పెట్టాను. ఈ సిరీస్ లో నా పాత్ర విషయానికి వస్తే.. మల్లికాజాన్ గతం లో నేను పోషించిన ఇతర పాత్రలకు భిన్నంగా ఉంటుంది. సంజయ్ లీల వంటి మేధావి నన్ను నడిపించడం వల్లనే ఇది సాధ్యమైంది. నన్ను సంజయ్ చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు ” అంటూ తెలిపింది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు