Mahesh Babu : పరశురామ్ తో మరోసారి ?

సర్కారు వారి పాట దర్శకుడు పరశురామ్ తో మహేష్ మరో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా? అంటే టాలీవుడ్ సర్కిల్స్ లో అవుననే సమాధానం ఎక్కువగా వినిపిస్తుంది. సర్కారు వారి పాట సినిమా ఫుల్ రన్ లో యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది. అయినా, పరశురామ్ పనితనానికి మహేష్ ఎంప్రెస్ అయ్యాడట. అందుకే పరశురామ్ డైరెక్షన్ లో మరోసారి నటించాలని ఫిక్స్ అయిపోయాడని సమాచారం. నిజానికి సర్కారు వారి పాట స్క్రిప్ట్ విషయంలో మహేష్ పూర్తిగా సంతృప్తి చెందలేదు. ఒక సందర్భంలో ఈ స్క్రిప్ట్ ను పక్కన పెట్టి, మరో సినిమా కోసం ట్రై చేశాడు కూడా. కానీ, వంశీ పైడిపల్లి స్క్రిప్ట్ నచ్చకపోవడంతో, పరశురామ్ స్క్రిప్ట్ నే ఫైనల్ చేశాడు మహేష్. మహేష్ పాత్రను ఫ్యాన్స్ కోరుకున్నట్లు గానే పరశురామ్ డిజైన్ చేశాడు. కానీ, హాఫ్ బేక్డ్ స్క్రిప్ట్ అన్నట్టు ఉంటుంది ఈ మూవీ.

దీని తర్వాత త్రివిక్రమ్, రాజమౌళితో మహేష్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో త్రివిక్రమ్ తో సినిమా ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులను చేసుకుంటుంది. అయితే, జక్కన్నతో చేయబోయే సినిమా ఆలస్యం అవుతుందట. 2023 సంక్రాంతి వరకు కూడా ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుకావని సమాచారం. ఇక సెట్స్ పైకి వెళ్ళడానికి మరింత టైం పట్టొచ్చు. త్రివిక్రమ్ సినిమ తర్వాత ఉండే గ్యాప్ ను పరశురామ్ తో భర్తీ చేయాలని మహేష్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. పరశురామ్ గతంలో చెప్పిన ఓ లైన్ మహేష్ కు తెగ నచ్చిందట. మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే పరశురామ్ ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసే అవకాశాలు ఉన్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు