మహేష్ బాబు కెరీర్లో ఒక మైలురాయిగా మిగిలిపోయిన సినిమా పోకిరి. అలానే మహేష్ విజయవంతమైన చిత్రాలలో బిజినెస్మెన్ కూడా ఒకటి. పూరి జగన్నాథ్ ఈ రెండు చిత్రాలకు దర్శకత్వం వహించారు.
కానీ తరువాత వీరిద్దరు ఇంకో ప్రాజెక్ట్ చేయలేదు. వీరి కాంబినేషన్ లో జన గణమన ప్రకటించినా ఆ తర్వాత పక్కన పెట్టారు.ప్రస్తుతం జనగణమన సినిమాను విజయ్ దేవరకొండతో చేస్తున్నాడు పూరి.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పోకిరి, బిజినెస్మెన్, సీక్వెల్స్ ఆలోచన గురించి పూరీ ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
బిజినెస్మెన్ చిత్రాన్ని సులభంగా ఫ్రాంచైజీగా మార్చుకోవచ్చని పూరీ జగన్నాథ్ వెల్లడించారు. సూర్య భాయ్ క్యారెక్టర్తో తాను చేయగలిగినవి ఇంకా చాలా ఉన్నాయని అంటున్నారు. పోకిరి విషయంలోనూ అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
పూరి జగన్నాథ్ మాట్లాడుతూ, ‘రెండు సినిమాల పార్ట్ 2 కోసం 2010ల ప్రారంభంలో నాకు ఆలోచన వచ్చింది, కానీ మహేష్ సార్ ఇతర చిత్రాలతో బిజీగా ఉన్నారు. మేము అప్పుడు సీక్వెల్స్ గురించి ఎప్పుడూ చర్చించలేదు, అందుకే రెండు సినిమాలూ ప్రారంభం కాలేదు.
ఇకపోతే పూరి జగన్నాథ్ కూడా బిజినెస్మెన్ని హిందీలో రీమేక్ చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. రీసెంట్ గా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన లైగర్ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది.
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఇంటర్వూ లో ఈ విషయాలను వెల్లడించారు పూరి.