Bimbisara: ముఖ్య అతిధులుగా చరణ్ – తారక్.?

టాలీవుడ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన సినిమా బింబిసార. తన సొంత బ్యానర్ లో హీరో కళ్యాణ్ రామ్ బింబిసార సినిమాను నిర్మించాడు. మల్లిడి వశిష్ట్‌ అనే కొత్త దర్శకుడు బింబిసార సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన బింబిసార సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుని, రిలీజ్‌ కు సిద్ధమైంది. పుణ్య భూమిలో ఓ అటవిక రాజు కథే ఈ సినిమా కథాంశం.

అయితే.. బింబిసార సినిమాలో హీరో కళ్యాణ్‌ రామ్‌ సరసన కాథరిన్‌ ట్రాసా, సంయుక్త మీనన్‌ లు హీరోయిన్లు గా నటిస్తున్నారు. సంయుక్త మీనన్‌ ఈ సినిమా మెయిన్‌ హీరోయిన్‌ అని తెలుస్తోంది. ఇక ఇప్పటికే బింబిసార సినిమా నుంచి విడుదల టీజర్లు, ట్రైలర్‌ సినిమాపై హైప్‌ ను అమాంతం పెంచేశాయి. అయితే.. తాజాగా ఈ సినిమా నుంచి మరో అదిరిపోయే అప్డేట్‌ వచ్చింది. బింబిసార సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కు స్పెషల్‌ గెస్ట్‌ గా జూనియర్‌ ఎన్టీఆర్‌ రానున్నారు.

ఈ విషయాన్ని స్వయంగా బింబిసార చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. మొదట ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ గెస్టులుగా అనుకున్నారు. కానీ చివరి క్షణాల్లో ఎన్టీఆర్‌ మాత్రమే వస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇక బింబిసార ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఈ నెల 29వ తేదీన శిల్పకళా వేదికలో గ్రాండ్‌ గా జరుగనుంది. కాగా.. ఈ మూవీ ఆగస్టు 5వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు