Pawan Kalyan: తెరపైకి మరో రీమేక్

వకీల్ సాబ్ సినిమాతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ వరుస సినిమాలను అనౌన్స్ చేసి అభిమానులకు ఆనందాన్ని ఇచ్చారు.
తన కెరియర్ లో అధికశాతం రీమేక్ సినిమాలే చేసారు కళ్యాణ్.
ఇప్పుడు కూడా మరొక రీమేక్ సినిమాను లైన్ లో పెట్టనున్నాడట పవర్ స్టార్. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ ఇలా వరసగా రెండు రీమేకులు చేశాక పవన్ కళ్యాణ్ ఇకపై స్ట్రెయిట్ సినిమాలు చేస్తారేమో అని అభిమానులు ఎదురుచూస్తున్న తరుణంలో అభిమానులకి ఇప్పుడు మరో ట్విస్ట్ వినిపించేలా ఉంది. ఎప్పుడో అనౌన్స్ చేసిన “హరిహర వీరమల్లు” “భవదీయుడు భగత్ సింగ్” ఇంకొంతకాలం వాయిదా అవుతాయేమో అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.

సముతిరఖని దర్శకత్వంలో “వినోదయ సీతం” సినిమాకి రీమేక్ గా మరో సినిమా రానుందనేది వినికిడి. ఇవన్నీ మొన్నటివరకు ఊహగానాలే అనుకున్నారంతా కానీ రీసెంట్ గా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో సముతిరఖని పవన్ ని డైరెక్ట్ చేయబోతున్నట్లు చెప్పి సర్ ప్రైజ్ చేశారు. తాను ‘వినోదయ సీతం’ తెలుగు రీమేక్ డైరెక్ట్ చేయబోతున్నట్లు క్లారిటీ ఇచ్చారు. తాను పవన్ కళ్యాణ్ కి పెద్ద అభిమానినని, తనలాంటి అభిమానులందరినీ దృష్టిలో పెట్టుకొని ఆయనను డైరెక్ట్ చేస్తానన్నారు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని, త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని సముతిరఖని తెలిపారు.

ప్రస్తుతం “వినోదయ సితం” రీమేక్ త్వరగానే మొదలు పెట్టబోతున్నారని ఫిలిం నగర్ టాక్. ఇందుకుగాను పవన్ ఇరవై రోజుల కాల్ షీట్లతోనే వేగంగా పూర్తి చేసేలా దర్శకుడు సముతిరఖనిని ముందుగానే ప్రిపేర్ అవ్వమని చెప్పారట. అంటే సెప్టెంబర్ లోపే పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

ఈ సినిమాలో పవన్ తో పాటు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా నటించనున్నారు.సాయి తేజ్ సరసన కృతి శెట్టి లేదా శ్రీలీల ఇద్దరిలో ఒకరిని ఫైనల్ చేస్తారని, పవన్ పాత్రకు గోపాల గోపాల మాదిరిగానే ఎటువంటి హంగులు లేకుండా చూపిస్తారని తెలుస్తోంది. రచన త్రివిక్రమే చేశారా లేక ఆ బాధ్యతను ఇంకెవరైనా తీసుకున్నారా అనే క్లారిటీ తెలియాల్సిఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు