Allu Arjun Votes In Hyderabad: మెగా హీరో అల్లు అర్జున్ గడిచిన రెండు రోజుల నుంచి ట్రెండింగ్ లో ఉన్నాడు. జనసేన పార్టీని కాదని నంద్యాల వైసీపీ పార్టీ అభ్యర్థికి అల్లు అర్జున్ ప్రచారం చేయడమే ఇప్పుడు దుమారం రేపపుతోంది. అయితే.. ఇవాళ హైదరాబాద్ లో ఓటు హక్కు వినియోగించుకున్న అల్లు అర్జున్…ఆ వివాదంపై స్పందించారు. నంద్యాల టూర్ పై క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్…పవన్ కళ్యాణ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.
నాకు ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేదని తేల్చి చెప్పారు అల్లు అర్జున్. మా మావయ్య పవన్ కళ్యాణ్ కు నా మద్దతు ఎపుడూ ఉంటుందని మరోసారి తెలిపారు అల్లు అర్జున్. నంద్యాల వైసీపీ పార్టీ అభ్యర్థి శిల్పా రవి నాకు 15 ఏళ్లుగా మిత్రుడు అన్నారు. అతనికి మద్దతు ఇస్తాను అని గతంలో మాట ఇచ్చానని గుర్తు చేశారు అల్లు అర్జున్.Allu Arjun Votes In Hyderabad
రాజకీయాలతో సంబంధం లేకుండా స్నేహితుడిగా మాత్రమే శిల్పా రవికి మద్దతుగా నంద్యాల వెళ్లానన్నారు అల్లు అర్జున్. నాకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం అస్సలు లేదు… ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించు కోవాలని కోరుకుంటున్నానని వివరణ ఇచ్చారు అల్లు అర్జున్. కాగా… జనసేన పార్టీ తరఫున రామ్ చరణ్ పిఠాపురంలో ప్రచారం చేసిన రోజునే… జనసేన పార్టీని కాదని నంద్యాల వైసీపీ పార్టీ అభ్యర్థికి అల్లు అర్జున్ ప్రచారం చేశారు.