Allu Arjun : సుకుమార్ కు స్వేచ్ఛ

సీక్వెల్ సినిమాలకు నిజానికి డిమాండ్ కాస్త ఎక్కువే ఉంటుంది. మొదటి సినిమా భారీ విజయం సాధించిన సినిమాలకు అయితే, మరీ ఎక్కువగా ఉంటుంది. ప్రేక్షకులు ఆ సీక్వెల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తారు. కానీ, దర్శక నిర్మాతలు మాత్రం మొదటి పార్ట్ కంటే, బెస్ట్ అవుట్ పుట్ ఇవ్వాలని ప్రయత్నిస్తారు. అందుకోసం సమయం కూడా తీసుకుంటారు. ఈ పరిస్థితి ప్రస్తుతం పుష్ప సినిమా విషయంలో జరుగుతుంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప మొదటి పార్ట్ గతేడాది డిసెంబర్ లో వచ్చిన విషయం తెలిసిందే.

పుష్ప ది రైజ్ ఊహించనంత హిట్ కొట్టడంతో సీక్వెల్ ’పుష్ప ది రూల్‘ పై డైరెక్టర్ సుక్కు ఫుల్ ఫోకస్ పెట్టాడు. టైమ్ తీసుకున్నా, మంచి అవుట్ పుట్ ఇవ్వాలని చూస్తున్నాడు. పుష్ప ది రూల్ సెట్స్ పైకి వెళ్లకపోవడంపై సుక్కుపై అప్పట్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫైర్ అయినట్టు కూడా వార్తలు వచ్చాయి. కానీ, అల్లు అరవింద్ చెప్పడంతో సుకుమార్ కు స్వేచ్ఛ ఇచ్చాడట. మంచి స్క్రిప్ట్ వచ్చిన తర్వాతే పుష్ప పార్ట్ 2 చేద్దామని చెప్పాడట. దీంతో సుక్కు స్క్రిప్ట్ పనుల్లో ఫుల్ బిజీ గా ఉన్నాడు.

తాజాగా సుక్కు తన శిష్యుడు ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుతో కలిసి స్క్రిప్ట్ పనులు జరుపుతున్నట్టు ఫోటోలు కూడా వచ్చాయి. దీంతో సుక్కుకు అల్లు అర్జున్ ఎంత స్వేచ్ఛ ఇచ్చాడో అర్థమవుతుంది. అల్లు అర్జున్ కూడా పుష్ప గురించి ఎక్కువ ఆలోచించకుండా వరుసగా యాడ్ షూటింగ్స్ చేస్తూ వస్తున్నాడు. ఇటీవలే హరీష్ శంకర్ విదేశాలకు వెళ్లి ఓ యాడ్ షూటింగ్ లో పాల్గొన్నాడు. తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒకటి, రెడ్ బస్ యాడ్ మరొకటి తో పాటు మళ్లీ తాజాగా హరీష్ శంకర్ తో యాడ్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు.

- Advertisement -

ఇలా సుక్కుకు స్వేచ్ఛ ఇచ్చిన అల్లు అర్జున్ యాడ్ షూటింగ్ లు చేయడం కంటే, మరో సినిమా సెట్స్ పైకి తీసుకెళ్తే బాగుంటుంది కదా అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా, సుక్కుకు స్వేచ్ఛ ఇవ్వడంతో పుష్ప ది రూల్ అవుట్ పుట్ బెటర్ గా రావచ్చు అని, పుష్ప పార్ట్ 1 రికార్డులను బ్రేక్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ అంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు