Big Breaking: హైదరాబాద్ సమీపంలోని మహబూబ్ నగరంలో జరిగిన ప్రమాదంలో సీరియల్ నటి పవిత్ర జయరాం మృతి చెందినట్లు తెలుస్తుంది. కన్నడ సీరియల్స్ లో తనదైన ముద్ర వేసుకున్న ఈమెకి ఉన్నట్లుండి ఈ విధంగా జరగడంతో ఈమె ఫాన్స్ కృంగిపోతున్నారు.
ఇక ఈరోజు పవిత్ర ప్రయాణిస్తున్న కారు, బస్సు ఢీ కొట్టుకోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. కన్నడిగుల నుంచి వచ్చిన పవిత్ర తెలుగు త్రినయని సీరియల్ తో పాపులర్ అయింది. ఇక ఇందులో చాలా పాపులారిటీ సంపాదించుకునే ప్రస్తుతం తెలుగు ఆఫర్స్ ని కూడా అందుకుంటుంది. ఈమె చాలా కష్టపడి ఇండస్ట్రీకే అడుగు పెట్టింది.
![Actress Pavitra who passed away in a road accident](https://www.telugu.filmify.in/wp-content/uploads/2024/05/MixCollage-12-May-2024-01-1.gif)
ఎటువంటి నాలెడ్జ్ లేకపోయినా యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ ఉండడంతో ఈమె మొదట కన్నడ సీరియల్స్ లోకి ఎంట్రీ ఇచ్చి అనంతరం తెలుగు పరిశ్రమలోకి కూడా అరంగేట్రం చేసింది. సొంతంగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి దాని ద్వారా గట్టి మొత్తంలో డబ్బులు సంపాదిస్తుంది. ఇక తనకి డబ్బు మరియు చదువు లేకపోవడం వల్ల మొదట్లో బతికేందుకు చాలా కష్టమైందని గతంలో ఇంటర్వ్యూలో తెలియజేసింది. ఇక ఈమెకి ఉన్నట్లుండి అకస్మాత్తుగా ఈ విధమైన ప్రమాదం జరగడంతో తన కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా కృంగిపోతున్నారు.