Chandu Mondeti: నాగచైతన్య తో ఇద్దరు హీరోయిన్స్ రొమాన్స్ ?

అక్కినేని నాగచైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జోష్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అక్కినేని నాగచైతన్య ఇప్పటివరకు చాలా సినిమాలో చేశారు. అయితే ఈ మధ్యకాలంలో అక్కినేని నాగచైతన్యకు మంచి హిట్స్ లేవన్న సంగతి తెలిసిందే. ఇటీవల రిలీజ్ అయిన కస్టడీ సినిమా కూడా ఏమాత్రం తెలుగు ప్రేక్షకులను ఆలరించలేకపోయింది. దీంతో ఎలాగైనా హిట్ కొట్టాలని నాగ చైతన్య అనుకుంటున్నాడు.

ఇక ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు నాగ చైతన్య. శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్నం మత్స్యకారుల స్టోరీ నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ చాలా గ్రాండ్ గా నిర్మిస్తోంది. కాగా తాజాగా ఈ సినిమా గురించి ఒక క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో నాగచైతన్య సరసన ఇద్దరూ హీరోయిన్లు రొమాన్స్ చేయనున్నట్లు సమాచారం అందుతుంది.

అందులో కీర్తి సురేష్ మరియు అనుపమ పరమేశ్వరన్ ఉన్నారని ఇప్పుడు టాక్ వినిపిస్తోంది. ఇందులో కీర్తి సురేష్ మెయిన్ హీరోయిన్ అని అనుపమ రెండవ హీరోయిన్ అని తెలుస్తోంది. సెకండాఫ్ లో అనుపమ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్టు టాలీవుడ్ సర్కిల్స్ లో ప్రచారం సాగుతోంది. అయితే ఈ సినిమాలో ఈ ఇద్దరు హీరోయిన్లతో రొమాంటిక్ సీన్స్ చాలానే ఉన్నాయట.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Gossips, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు