Ponniyin Selvan : నైజం రారాజు చేతికే

అగ్ర దర్శకుడు మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న తాజా చిత్రం పొన్నియన్ సెల్వన్-1. 1955 లో వచ్చిన పొన్నియన్ సెల్వన్ అనే నవల ఆధారంగా దర్శకుడు మణిరత్నం ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడ‌క్ష‌న్స్, మ‌ద్రాస్ టాకీస్ బ్యానర్లపై అల్లి రాజా సుభాస్కారన్, మణిరత్నం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రలో చియన్ విక్రమ్‌, కార్తి, జయం రవి, ఐశ్వ‌ర్య‌రాయ్‌, త్రిష, బాబీ సింహా, శోభితా ధూళపాళ, ప్రభు, శరత్ కుమార్, ప్రకాశ్ రాజ్ వంటి స్టార్లు నటిస్తున్నారు. ఈ చిత్రం రెండు భాగాలుగా వస్తుంది. మొదటి భాగం ఈ ఏడాది సెప్టెంబర్ 30న పాన్ ఇండియా స్తాయిలో విడుదల కానుంది.

భారీ అంచనాలు ఉన్న పొన్నియన్ సెల్వన్ 1 తెలుగు హక్కులు ఎవరికి దక్కుతాయా అని ఆసక్తి ఉంది. అయితే ప్రస్తుతం కోలీవుడ్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం.. టాలీవుడ్ అగ్ర నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు పొన్నియన్ సెల్వన్ 1 తెలుగు హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది. దీని కోసం లైకా ప్రొడ‌క్ష‌న్స్, మ‌ద్రాస్ టాకీస్ కు దిల్ రాజు భారీ మొత్తంలో చెల్లించినట్లు సమాచారం అందుతుంది. అయితే దీనిపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాలేదు.

పొన్నియన్ సెల్వన్ చిత్రానికి కేవలం తమిళంలోనే కాదు.. తెలుగులోనూ భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే ఇటీవల వచ్చిన రెండు పాటలు తెలుగు ప్రేక్షకులకు విపరీతంగా ఆకట్టుకున్నాయి. బాహుబలి స్థాయిలో పొన్నియన్ సెల్వన్ ఉంటుందని మణిరత్నం చెప్పడంతో అంచనాలు ఇంకా పెరిగాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు