Lingusamy : టాలీవుడ్ లోకి షిఫ్ట్ ?

కోలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసినా, మంచి పేరు ఉన్న డైరెక్టర్ లింగు సామి. ఈ డైరెక్టర్ తమిళంలోనే కాదు, పందెం కోడి, పందెం కోడి2 సినిమాలతో తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజా గా ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో ది వారియర్ అనే సినిమాతో నాలుగేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ప్రస్తుతం థియేటర్ లలో యావరేజ్ టాక్ తో నడుస్తుంది. తెలుగు నెటివిటితో కాకుండా, తమిళ ప్రేక్షకులను ప్రసన్నం చేసుకోవడానికే సినిమా తెరకెక్కించినట్టు ఉందని సినీ విశ్లేషకుల అంటున్నారు. అలాగే హీరో కంటే, విలన్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడని రివ్యూలు చెబుతున్నాయి.

ది వారియర్ ఫలితం ఎలా ఉన్నా, ఈ కోలీవుడ్ డైరెక్టర్ కు తెలుగులో మరో ఛాన్స్ వచ్చినట్టు ఇండస్ట్రీ సర్కిల్స్ లో వినిపిస్తోంది. లింగ్ సామితో సినిమా చేయడానికి ఓ నిర్మాత తెగ ప్రయత్నిస్తున్నాడట. ఆ నిర్మాత ఎవరో కాదు బెల్లంకొండ సురేష్. ఈ బడా నిర్మాత కొడుకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ టాలీవుడ్ లో హీరోగా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కొన్ని సినిమాలో శ్రీనివాస్ కనిపించాడు. ఆ ఫలితాలు ఎలా ఉన్నా, వరుసగా సినిమాలు చేస్తున్నాడు.

ఇటీవలే ఛత్రపతి రీమేక్ తో బాలీవుడ్ కు కూడా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. దానికి సంబంధించిన షూటింగ్ కూడా ఇప్పటికే స్టార్ట్ అయింది. ఇదిలా ఉండగా, సాయి శ్రీనివాస్ ను బాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోనూ పరిచయం చేయాలని బెల్లంకొండ సురేష్ ప్లాన్ చేస్తున్నాడట. దీనికి లింగు సామి డైరెక్టర్ గా ఉంటే, ఇటు తెలుగు ప్రేక్షకులకు, అటు తమిళ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఉంటుదని ప్లాన్ వేసినట్టు తెలుస్తుంది. అందుకోసమే లింగు సామిని లాక్ చేసే పనిలో ఉన్నారని సమాచారం. ఒక వేళ లింగు సామితో బెల్లంకొండ సినిమా ఫిక్స్ అయితే, ఈ హీరో కోలీవుడ్ ఎంట్రీ కూడా ఫిక్స్ అయినట్టే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు