టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు ఉన్న ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. తెలుగుతో పాటు బాలీవుడ్ లో కూడా సమంతకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సమంత నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ శాకుంతలం. ఈ సినిమా కోసం అభిమానులంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. ఈ మధ్యనే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది.
కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా గుణశేఖర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇది ఇలా ఉండగా సమంత ఇటీవల వ్యాధి నిరోధక శక్తికి సంబంధించిన మయోసైటిస్ అనే వ్యాధికి గురయ్యారు. అనారోగ్యంతో ఇటీవల ఆమె కెరీర్ కూడా నిదానించింది. ఈ కారణంగా కొన్ని చిత్రాల షూటింగ్ లు ఆలస్యమయ్యాయి. అయినప్పటికీ ఒక్కో చిత్రం పూర్తిచేస్తూ తన పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే తాజాగా స్ఫూర్తిదాయకరీతిలో తనను ఉద్దేశించి తానే ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ చేశారు సమంత. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
“కష్టకాలం ముగిసింది, ఇక ఊపిరి పీల్చుకో పాప! త్వరలోనే అంతా మామూలుగా అయిపోతుందని హామీ ఇస్తున్నా. ఈ ఏడెనిమిది నెలల్లో ఎంతో బాధకరమైన పరిస్థితులు చవిచూసావు. వాటిని నువ్వు అధిగమించావన్న విషయం ఎప్పటికీ మర్చిపోవద్దు. మెదడు మొద్దు బారిపోయింది. ఎప్పుడు ఏదో పరాద్యానం, అయినప్పటికీ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ నువ్వు ముందుకెళ్లావు, అదే నువ్వు సాధించిన విజయం. అది ఎంతో అద్భుతం అనిపిస్తుంది. నీ పట్ల ఎంత గర్విస్తున్నానంటే అంత గర్విస్తున్నాను. నీ పట్ల కూడా నువ్వు గర్వించాలి. నువ్వు చాలా గట్టిదానివి” అంటూ తన పోస్టులో పేర్కొన్నారు.
View this post on Instagram
For More Updates :
Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News